హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తేతెలంగాణ) : రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ప్రపంచ రికార్డు నమోదు చేస్తోంది. ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల్లో ఒకటిగా ఆదిలాబాద్, హైదరాబాద్ నిలిచాయి. అమెరికాకు చెందిన ప్రముఖ వాతావరణ సంస్థ ఎల్డోరాడో వెదర్ రూపొందించిన నివేదికలో ప్రపంచంలోని 100 అత్యంత వేడి నగరాల జాబితాలో ఆదిలాబాద్ చేరింది. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేడి నమోదైన నగరాల్లో ఆదిలాబాద్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. మహారాష్ట్రలోని అకోలా 45 డిగ్రీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కొత్తగూడెంలో 43.3, గద్వాల 43.3, నిర్మల్ 43.0, నిజామాబాద్ 43.0 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
కేవలం ఆదిలాబాద్ మాత్రమే కాకుండా.. హైదరాబాద్లోని కొత్తపేట తదితర పట్టణ ప్రాంతాలు కూడా గ్లోబల్ హీట్ లిస్టులో చేరడం ఆందోళన కలిస్తున్నట్లు ఎల్డోరాడో వెల్లడించింది. మూసీ నది పరీవాహక ప్రాంతంలో ఉండటం, భూగర్భ జలాలు పడిపోవడంతో ఇకడ వేడి ఎకువగా నమోదవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం హైదరాబాద్ సరూర్నగర్ సరిల్లోని న్యూ నాగోల్ ప్రాంతంలో 41.7 డిగ్రీల సెల్సియస్, ముషీరాబాద్ ప్రాంతంలో 41.6 డిగ్రీల సెల్సియస్, అంబర్ పేట 41.4. మలాజిగిరి 41.3, ఎల్బీనగర్, 41.3, మొహిదిపట్నం 41.1 డిగ్రీ సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.