ఆదిలాబాద్, జనవరి 24 : ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడలో 2020 డిసెంబరు 18న జరిగిన కాల్పుల కేసులో నిందితుడు ఎంఐఎం జిల్లా మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఆదిలాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. పిల్లల గొడవ విషయంలో నిందితుడు పిస్టల్తో సయ్యద్ మన్నన్, సయ్యద్ జమీర్, సయ్యద్ మోతేశాంలపై దాడికి పాల్పడ్డాడు. చికిత్స పొందుతూ సయ్యద్ జమీర్ మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఆదిలాబాద్లోనే ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసింది. 26 మంది సాక్ష్యులను విచారించిన కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.12 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.