జగిత్యాల : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జిల్లాలోని రాయికల్ పట్టణంలో శుక్రవారం బీజేపీ పార్టీ మహిళ విభాగం జిల్లా నాయకురాలు తోకల లత, తోకల రవీందర్ వారి అనుచరులు 50 మంది జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సమక్షంలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ చేరుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్నారు.
ఇవి కూడా చదవండి..
పసిబిడ్డను పొట్టనబెట్టుకున్న అమ్మమ్మ
డ్రైవర్ లేకుండానే నడిచిన ట్రాక్టర్.. వీడియో
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
ఆ పథకాలన్నీ గత బడ్జెట్లోనివే : గుత్తా సుఖేందర్ రెడ్డి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి