హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): నవీన్ మిట్టల్, వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా నవీన్ మిట్టల్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రాహుల్ బొజ్జాను ఆ బాధ్యతల నుంచి తప్పించి నవీన్ మిట్టల్కు ఇచ్చారు. సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్గా ఉన్న నవీన్ మిట్టల్ను ఆ బాధ్యతల నుంచి తప్పించి, వాకాటి కరుణకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.