హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో నటుడు సుమన్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియం ఆవరణలో సుమన్ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి పరిరక్షణ కోసం సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం అని కొనియాడారు. ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటానని తెలిపారు. భవిష్యత్లో తన అభిమానులు అందరూ కూడా మొక్కలు నాటి గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి మండలం జడ్పీటీసీ ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ నాగయ్య,టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.