Chiranjeevi | తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramark)తో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) భేటీ అయ్యారు. గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి ప్రజాభవన్కు వచ్చిన చిరంజీవి.. అక్కడ డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి దంపతులకు డిప్యూటీ సీఎం పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఇరువురూ కాసేపు మాట్లాడుకున్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని చిరంజీవి శాలువాతో సత్కరించారు. అనంతరం చిరంజీవి దంపతులకు సైతం భట్టి సత్కారం చేశారు. చిరుతో భేటీకి సంబంధించిన ఫొటోలను డిప్యూటీ సీఎం తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కొత్త మంత్రులను ఒక్కొక్కరిని మెగాస్టార్ కలుస్తున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే.
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారి దంపతులు@KChiruTweets #BhattiVikramarkaMallu #Chiranjeevi pic.twitter.com/m11XTpPBsX
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 4, 2024
ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారిని ప్రజాభవన్ లో కలిసిన ప్రముఖ సినీ నటుడు శ్రీ చిరంజీవి గారి దంపతులు@KChiruTweets #BhattiVikramarkaMallu #Chiranjeevi pic.twitter.com/0I71tmNCDf
— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) January 4, 2024
#WATCH | Telangana: Actor Chiranjeevi Konidela met Telangana Deputy CM Bhatti Vikramarka at the latter’s residence in Hyderabad yesterday.
(Source: Congress) pic.twitter.com/eNQFC9iLbI
— ANI (@ANI) January 5, 2024
Also Read..
Accident | హయత్నగర్లో బైకును ఢీకొట్టిన టిప్పర్.. తండ్రీకొడుకులు మృతి
Houthi Rebels | అమెరికా హెచ్చరికలను పట్టించుకోని హౌతీ రెబెల్స్.. మరో వాణిజ్య నౌకపై దాడి
Japan | జపాన్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. 92కు చేరిన భూకంప మృతులు