హైదరాబాద్: హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో (Hayath Nagar) రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. హయత్నగర్ పరిధిలోని కుంట్లూరులో (Kuntloor) బైకును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైపు పూర్తిగా దగ్ధమవగా, టిప్పర్ పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. మృతులను కుత్బుల్లాపూర్కు చెందిన కుమార్ (40), ప్రదీప్ (8)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నామని చెప్పారు.