Babumohan | ఖైరతాబాద్, అక్టోబర్ 28: ఈసారి తాను బీజేపీ నుంచి పోటీ చేయబోనని, పార్టీకీ దూరంగా ఉంటానని, తనకు టికెట్ కేటాయించాల్సిన అవసరం లేదని బీజేపీ నేత, సినీనటుడు బాబుమోహన్ స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధిష్ఠానం పట్ల అసంతృప్తిని వెలిబుచ్చారు.
ఆందోల్ నుంచి తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా పనిచేశాననని చెప్పారు. బీజేపీలో తాను ఎన్నడూ టికెట్ ఆశించలేదని, కానీ టికెట్ల కేటాయింపు విషయాన్ని పార్టీ అధిష్ఠానం తనకు తెలియకుండా రహస్యంగా దాచిపెట్టడం సబబు కాదని చెప్పారు. తనకు, తన కొడుకు మధ్య పోటీ అని కొందరు ట్రోల్ చేశారని తె లిపారు. బీజేపీ పెద్దల నిర్ణయం ఆధారంగా పార్టీలో ఉండాలో, వెళ్లిపోవాలో త్వరలోనే ప్రకటిస్తానని చెప్పారు.