వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో యాసిడ్ దాడి (Acid attack) జరిగింది. వేములవాడలోని తిప్పాపూర్లో చికెన్ నాణ్యత విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పది మంది చికెన్ సెంటర్ నిర్వహాకులపై చిరువ్యాపారులు యాసిడ్ దాడి చేశారు. దీంతో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషంగా ఉందని చెప్పారు. ఈ ఘటనలో పది మందిపై కేసులు నమోదు చేశారు.