Crime News | ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కేసులో బుధవారం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్లో బాంబు పెట్టామని.. మరికొద్దిసేపట్లో పేలబోతుందంటూ ఓ వ్యక్తి మంగళవారం పోలీసులకు ఫోన్ చేశాడు. దాంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్కు చేరుకొని అణువణువు గాలించారు. రెండుగంటలకుపైగా తనిఖీలు నిర్వహించగా అనుమానాస్పద వస్తువులు ఏవీ దొరకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అకతాయి పనిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తి కోసం ఆరా తీశారు. ఈ క్రమంలో నిందితుడు శివరామకృష్ణను పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించి డయల్ 100 కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. భార్యతో గొడవపడి మద్యం మత్తులో ఫోన్ చేసినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. శివరామకృష్ణ ముషీరాబాద్లో నివాసం ఉంటుండగా.. అతని స్వస్థలం గుంటూరు జిల్లాగా గుర్తించారు.