బీజేపీ పాలిత గుజరాత్ 14, మహారాష్ట్ర 13, మధ్యప్రదేశ్ 4వ ర్యాంకుల్లో నిలిచాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ పోర్టల్ అందుబాటులో ఉన్నిది. పోర్టల్ను సమర్థంగా వినియోగిస్తున్న రాష్ట్రాలకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్లు ఇస్తున్నది. ఇందులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది.
మూడు నెలల బఫర్ స్టాక్ను మెయింటెయిన్ చేయడం, ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ కొరత లేకుండా చూడటం, జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ దవాఖానల సూపరింటెండెంట్లకు అత్యవసరంగా ఔషధాలను కొనుగోలు చేసేందుకు కొంత నగదును కేటాయించడం వంటి చర్యల ఫలితంగా రాష్ట్రంంలో ఎకడా మందుల కొరత లేకుండా ప్రభుత్వం చేయగలిగింది.
రోగులపై ఒక్కపైసా భారం పడకుండా అత్యంత ఖరీదైన చికిత్సలు కూడా అందిస్తున్నది. ఔషధాల పంపిణీని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 310 మంది ఫార్మసిస్టులను నియమించింది. వీటన్నింటి ఫలితంగానే తెలంగాణ దేశంలోనే ఉత్తమ స్థానంలో నిలిచింది.