పెద్దపల్లి : భూములకు సంబంధించిన డాక్యుమెంట్ల(Documents) కోసం బాధితుడి నుంచి లంచం(Bribe) తీసుకున్న సబ్రిజిస్టర్(Sub Register), అటెండర్(Attender)ను అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB Officers) వలవేసి పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా(Peddapalli) కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్గా పనిచేస్తున్న దేవనగరి నిర్మల, అటెండర్శ్రీనివాస్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్(Red handed)గా చిక్కారు.
పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన డాక్యుమెంట్ల కోసం సబ్ రిజిస్టార్ లంచం డిమాండ్ చేసింది. డబ్బులు ఇచ్చినప్పటికీ మరికొంత కావాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం బాధితుడి నుంచి సబ్ రిజిస్టర్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసు రూ. 60 వేలు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వీరభద్రయ్య ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.