చాంద్రాయణగుట్ట, ఏఫ్రిల్,27: ఓ కాంట్రాక్టర్ బిల్లు పాస్ కావడానికి సంతకం పెట్టేందుకు లంచం వసూలు చేసిన ఓ అవినీతి అధికారి, ఆమె అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ సౌత్జోన్ కార్యాలయం పరిధిలో క్లాస్-వీ సివిల్ కాంట్రాక్టర్ ఉమర్ అలీఖాన్ రూ.4 లక్షల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశారు. బిల్లు పాస్ కావడానికి విజువల్ రిపోర్టుపై సంతకం పెట్టేందుకు సర్కిల్-8 డిప్యూటీ కమిషనర్ రిచా గుప్తా రూ.2 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు గురువారం మధ్యాహం డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి కాం ట్రాక్టర్ ఉమర్ అలీఖాన్ వెళ్లి ఆమె సూచన మేరకు అసిస్టెంట్ సతీశ్కు రూ.2 వేలు లంచంగా ఇచ్చాడు. వెంటనే ఏసీబీ డీఎస్పీ అధికారి సయ్యద్ ఫయాజ్ బృందం రిచాగుప్తాను, అసిస్టెంట్ సతీశ్ను అదుపులోకి తీసుకొని నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో స్పెషల్ జడ్జి ఎదుట హాజరుపర్చారు.