నిర్మల్ : నిర్మల్ మున్సిపల్ కార్యాలయం(Nirmal Municipal Office)లో ఏసీబీ(ACB) అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ పట్టణంలోని ఏఎన్ రెడ్డి కాలనీకి చెందిన ఆర్టీసీ కంట్రోలర్ గోపాల్ రెడ్డి తన ఇంటి నెంబర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇంటి నెంబర్ ఇవ్వాలంటే రూ.3,500 లంచం (bribe) ఇవ్వాలని రెవెన్యూ ఆఫీసర్ గంగాధర్, బిల్ కలెక్టర్ నవంతు డిమాండ్ చేశారు. చేసేది లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచేన మేరకు మంగళవారం గంగాధర్, నవంతుకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.