హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్టయిన జలమండలి జనరల్ మేనేజర్ అనంత లక్ష్మీకుమార్ను ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఆయనను రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో బుధవారం మొదటిరోజు విచారణ చేశారు.
ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ.1.10 కోట్ల నగదు, 2.1 కిలోల బంగారు ఆభరణాలు, 9.2 కిలోల వెండి వస్తువులు ఏసీబీ స్వాధీనం చేసుకున్నది. హైదరాబాద్తోపాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించింది.