నాగిరెడ్డిపేట, జనవరి 6: వ్యవసాయ భూమిలో పేరు మార్పునకు రూ. 50 వేల లంచం తీసుకుంటూ కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నాగిరెడ్డిపేటకు చెందిన ఓ వ్యక్తి తన తండ్రి పేరిట ఉన్న వ్యవసాయ భూమిని తన పేరుపై మార్చాలని తహసీల్దార్ శ్రీనివాస్రావును కోరారు. మ్యుటేషన్ చేయడానికి రూ.50 వేలు లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. మంగళవారం ఆఫీస్లో ఉన్న ప్రైవేట్ వ్యక్తి చినూర్ అజయ్ 50 వేలను బాధితుడి నుంచి తీసుకొని తహసీల్దార్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.