హైదరాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ)/ సుల్తాన్బజార్ : లంచం తీసుకుంటుండగా మున్సిపల్ శాఖలోని డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ మాసబ్ట్యాంక్లో ఉన్న పట్టణ,గ్రామీణ ప్రణాళిక శాఖ కార్యాలయంలో బుధవారం ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చలిమెడ గ్రామానికి చెందిన వి.జితేందర్రెడ్డి స్వగ్రామంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి డీటీసీపీ లే ఔట్ పర్మిషన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నాడు.
అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా రూ.90వేలు లంచం ఇవ్వాలని డీటీసీపీ డిప్యూటీ డైరెక్టర్ డిమాండ్ చేయగా, రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో బుధవారం మాసబ్ట్యాంక్లోని కార్యాలయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా జగన్మోహన్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రెండు బృందాలు జగన్మోహన్ ఇంట్లోసోదాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.