మల్కాజిగిరి, అక్టోబర్ 31: ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని అడ్వకేట్ రామారావు ఇమ్మానేని లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. మైనంపల్లి కోట్ల రూపాయల అవినీతి సొమ్ము కూడబెట్టారని, ఆయనతోపాటు భార్య వాణి, కుమారుడు రోహిత్పైన మంగళవారం ఫిర్యాదు చేశారు. 2017లో జరిగిన ఎన్నికల అఫిడవిట్లో తన ఆస్తి విలువ రూ.3 కోట్లుగా, మైనంపల్లి వాణి ఆస్తి సుమారు రూ.50 లక్షలుగా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన పద్దెనిమిది విదేశీ కార్లు, కోట్ల విలువజేసే అరబ్ గుర్రాలు, విదేశీ పెంపుడు కుక్కలు, సొంత విమానాలు రోహిత్కు ఉన్నాయని తెలిపారు.