హైదరాబాద్ : సకాలలంలో వేతనాలు(Wages )పడక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని, అంగన్వాడీలకు (Anganwadis) సకాలంలో జీతాలు చెల్లించాలని (మినీ) అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆడెపు వరలక్ష్మి(Aadepu Varalakshmi )అన్నారు. ఈ మేరకు సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కాంతి వెస్లీని కలిసి వినతి పత్రం అందజేశారు. గత రెండు నెలలుగా గౌరవ వేతనాలు పడక అంగన్వాడీ టీచర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి నెల ఒకటో తేదీనే గౌరవ వేతనం, ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నట్లుగా అదే రోజు చెల్లించాలని వారు కమిషనర్ను కోరారు. కాగా, బడ్జెట్ కారణంగా వేతనాలు ఆలస్యం అయిందని ఈ వారం రోజుల్లో వేతనాలు అందరికి వేస్తామని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు కోయేటి రేణుక, బానోత్ లత, తదితరులు పాల్గొన్నారు.