హైదరాబాద్ : జగిత్యాల జిల్లాలో(Jagityala district) దారుణం చోటు చేసుకుంది. గొడ్డలితో నరికి ఓ యువకుడిని(Brutal murder) హతమార్చారు. ఈ విషాదకర సంఘటన రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగెల్లి సురేష్24) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు.
మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సురేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.