Transgender | వేములవాడ : ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపించింది ఈ జంట. ట్రాన్స్జెండర్తో ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ యువకుడు శనివారం పెళ్లి చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయంలో జరిగిన ఈ వివాహానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన 23 ఏండ్ల శ్రీనివాస్, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన 22 ఏండ్ల హిజ్రా పింకీ గత ఐదేండ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరూ ఐదేండ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకరిద్దరు బంధువులతో పాటు తెలిసిన వాళ్లతో కలిసి వేములవాడకు వచ్చి రాజన్న ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, శ్రీనివాస్ డిగ్రీ పూర్తి చేయగా, ప్రస్తుతం ప్రైవేట్ జాబ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. ఇద్దరం కూడా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు మీడియాకు వెల్లడించారు.