హైదరాబాద్ : ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలితీసున్నది. స్నేహితులతో కలిసి సరదాగా చెరువులో ఈతకెళ్లిన యువకుడు శవమై(Man died) తేలాడు. ఈ విషాదకర సంఘటన జగిత్యాల(Jagithyala) జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నిజాంబాద్ జిల్లా ధర్మోరా గ్రామానికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి చిట్టాపూర్ గ్రామానికి చెందిన యువకులతో కలిసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లారు.
అయితే రాత్రి అయినా ఎంతకూ శివకుమార్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా మృతదేహం చెరువులో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. శివ మృతి పట్ల అనుమానంగా ఉందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.