నందిపేట్, మార్చి 29 : వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. నందిపేట్ మండల కేంద్రానికి చెందిన బొడ్డు మహేశ్ (36) లక్కంపల్లి సెజ్లో వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఈనెల 8న నైట్ డ్యూటీ చేస్తుండగా..
తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో బయట నిద్రిస్తున్న మహేశ్పై ఓ వీధికుక్క ముఖంపై దాడిచేసింది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మహేశ్ను తోటి ఉద్యోగులు స్థానిక దవాఖానకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జిల్లా దవాఖానకు తరలించారు. మరుసటి రోజు నుంచి ఇంటి వద్దే చికిత్స పొందుతున్న మహేశ్ గురువారం రాత్రి వాంతులు చేసుకొని మృతి చెందాడు.