నల్లగొండ : సెల్ఫీ పిచ్చిలో పడి యువత నిండు ప్రాణాల్ని బలితీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించడానికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నల్లగొండ జిల్లా డిండి ప్రాజెక్ట్ వద్ద హైదరాబాద్లోని ఎర్రగడ్డ కు చెందిన మనోజ్ (22) అనే యువకుడు సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో గల్లంతయ్యాడు.
ఈ విషాదకర సంఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే చీకటి పడడంతో పోలీసులు గాలింపు చర్యలు నిలిపివేశారు. ఆదివారం ఉదయం ప్రాజెక్ట్లో గాలింపు చర్యలు చేపట్టగా మనోజ్ మృతదేహం లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిండి పోలీసులు తెలిపారు.