గీసుగొండ, మార్చి 7: పోలీస్ స్టేషన్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేటలో జరిగింది. గత నెల 28న శాయంపేటకు చెందిన ఆకుల కుమారస్వామి తన ఇంట్లో దొంగతనం జరిగి ఆరున్న ర తులాల బంగారం చోరీకి గురైందని ఈనెల 1న గీసుగొండ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గ్రామానికి చెందిన పోలం వంశీకృష్ణ (26)పై అనుమానం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎస్సై శ్వేత సోమవారం విచారణ కోసం వంశీకృష్ణను స్టేషన్ కు పిలిపించగా.. దారి మధ్యలో మ చ్చాపురం వద్ద గడ్డి మందు కొనుగోలు చేసి వెంట తెచ్చుకున్నాడు. ఎస్సై అతడితో మాట్లాడి లోపల కూర్చోమని చెప్పగా.. కొద్ది సేపటికే వెంట తెచ్చుకున్న గడ్డి మందు తాగి వాంతులు చేసుకున్నాడు. పోలీసు వాహనంలో ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం చనిపోయాడు. చేయని నేరానికి వేధించడం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి రాధ ఆరోపిస్తున్నది. వంశీకృష్ణ తల్లి రాధ, చెల్లి దివ్యతో కలిసి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వంశీకృష్ణను విచారణ కోసమే స్టేషన్కు పిలిచామని, అతన్ని వేధించలేదని గీసుగొండ సీఐ సట్ల రాజు వివరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని చెప్పారు.