ములుగు : ములుగు(Mulugu) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్(Electric shock)తో ఓ రైతు మృతి(Farmer died) చెందాడు. ఈ విషాద సంఘటన జిల్లాలోని గోవిందరావుపేట మండలం దుంపెల్లి గూడెంగ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పిండి రమేష్(28) అనే యువరైతు తన పంట పొలాల వద్దకు వెళ్తుండగా.. వన్య ప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘట స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేశ్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.