జోగులాంబ గద్వాల : విద్యుత్ షాక్తో(Electric shock )ఓ యువరైతు(young farmer) మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల(Jogulamba district) ధరూర్ మండలం నెట్టెంపాడు (Nettempadu) గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లొడ్డ తిప్పన్న (30) అనే వ్యక్తి తమ వ్యవసాయ పొలంలోని బోరు మోటర్ దగ్గర ప్రమా దవశాత్తు కేబుల్ వైర్కు తగిలి కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచనామ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గద్వాల ప్రభుత్వ జిల్లా దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. తిప్పన మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.