గార్ల, జనవరి 9: అప్పుల బాధతో ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మం డలం పుల్లూరులో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన చాపల వెంకన్న (33) బీటెక్ వరకు చదివాడు. గత ఏడాది తనకున్న అర ఎకరంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి తోట సాగు చేశాడు.
పంటకు తెగుళ్లు సోకడంతో ఆశించిన దిగుబడి రాలేదు. ఫలితంగా రూ.6 లక్షల వరకు అప్పులయ్యాయి. మనస్తాపానికి గురైన వెంకన్న సోమవారం వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి బావిలో దూకి ఆత్యహత్య చేసుకున్నాడు. వెంకన్న ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతకగా మంగళవారం బావిలో మృతదేహం లభించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.