హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): ఇటీవల ప్రధాన మంత్రి ప్రకటించిన జాతీయ పసుపుబోర్డును నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని కోరుతూ వ్యవసాయ, మారెటింగ్, సహకార, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారు.
ఈ విషయాన్ని ఆయన ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు పసుపు రైతుల చిరకాల ఆకాంక్ష అని, అందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించి పసుపు బోర్డు ఏర్పాటుకు అక్టోబర్లో గెజిట్ విడుదల చేసిందని పేర్కొన్నారు. అయితే అందులో ఏర్పాటు చేసే ప్రదేశం, బడ్జెట్ ప్రతిపాదనలేవీ లేవని తెలిపారు. రాష్టంలో పసుపు పండించే జిల్లాల్లో నిజామాబాద్ ప్రధానమైనదని, బోర్డును అక్కడే ఏర్పాటు చేయాలని సూచించారు.