ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 10 : రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బైక్ను సాగర్ రహదారిపై టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మోటర్సైకిల్పై వెనుక కూర్చున్న మాడ్గుల మండలం దుబ్బగడ్డ గ్రామానికి చెందిన రమావత్ నాన్క్(40) అనే మహిళా కిందపడిపోవటంతో తీవ్ర రక్తస్రావం అయి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానాకు తరలించారు.