నేరడిగొండ, ఆగస్టు 31 : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రాఖీ పండుగ కోసం తన భర్తతో కలిసి స్వగ్రామానికి వచ్చిన ఓ మహిళ గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కన్గుట్ట గ్రామానికి చెందిన నల్ల లింగయ్య నిర్మల్ జిల్లా మంజులాపూర్లో తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. నల్ల లింగయ్య, తన భార్య నర్సవ్వ(38)తో కలిసి రాఖీ పండుగ కోసం బుధవారం కన్గుట్టకు వచ్చాడు.
గురువారం పండుగ ముగించుకొని తిరిగి మంజులాపూర్కు లింగయ్య, తన భార్య నర్సవ్వ, తమ్ముడు కల్యాణ్తో కలిసి బైక్పై వెళ్తున్నాడు. నేరడిగొండలోని నీలిమాదాబా వద్ద కారు, బైక్ ఢీకొనడంతో నర్సవ్వ అక్కడికక్కడే మృతి చెందింది. లింగయ్య, కళ్యాణ్కు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అంబులెన్స్లో నిర్మల్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడుపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు.