హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ)ను ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం సందర్శించింది. శనివారం ఐక్యరాజ్య సమితికి చెందిన 11 మంది సభ్యులు క్యాంపస్లో విద్యా ప్రమాణాలను పరిశీలించారు.
ఐఎస్బీ వాతావరణం, క్యాంపస్లోని పరిశోధనలు, ర్యాంకింగ్ తదిరత అంశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఐఎస్బీని సందర్శించిన వారిలో బార్బడోస్, గాంబియా, కజకిస్తాన్, మాలి, మౌరిటానియా, మంగోలియా, మైక్రోనేషియా, సియెర్రా లియోన్, సౌత్ సుడాన్, సెయింట్ లూసియా, టోంగా దేశాలకు చెందిన అంబాసిడర్లు ఉన్నారు. ఐఎస్బీ సెంటర్ ఫర్ ఎనలిటికల్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ప్రొఫెసర్ ప్రసన్న, ఐఎస్బీ సీనియర్ డైరెక్టర్ కుమార గురులు బృందానికి ఐఎస్బీ గురించి వివరించారు. ఈ బృందం 28వ తేదీ వరకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సందర్శించనున్నది.