న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారతీయ అథ్లెట్ల కోసం అక్కడ ఉన్న ఎంబసీలో ఒలింపిక్ మిషన్ సెల్ను ఏర్పాటు చేశారు. మహా క్రీడల్లో పాల్గొనేందుకు వస్తున్న భారతీయ అథ్లెట్లకు అవసరమైన లాజిస్టిక్ సపోర్ట్ను అక్కడ కల్పించనున్నారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా అథ్లెట్లకు సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఒలింపిక్ మిషన్ సెల్ను ప్రారంభించినట్లు కేంద్ర క్రీడా వ్యవహారాల శాఖ పేర్కొన్నది. ఒలింపిక్స్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారతీయ జట్లు, క్రీడాకారుల గురించి నిరంతరం సమీక్షిస్తున్నట్లు క్రీడాశాఖ చెప్పింది. కోచ్లు, డాక్టర్లు, ఫిజియోథెరపిస్టుల్లాంటి అదనపు సిబ్బందిని వీలైనంత ఎక్కువ సంఖ్యలో పంపేందుకు నిర్ణయించినట్లు క్రీడాశాఖ వెల్లడించింది. క్రీడాశాఖ నుంచి ఎటువంటి ప్రత్యేక బృందాన్ని పంపడం లేదని క్రీడలశాఖ పేర్కొన్నది.