హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): ఈ నెల 16న హైదరాబాద్లో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ పోస్టర్, కరపత్రాలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిషరించారు.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల భారీ విగ్రహంతో పాటు నూతన సచివాలయానికి ఆయన పేరు పెట్టినందుకు కృతజ్ఞతగా చలో ఇందిరా పార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడె రాజీవ్సాగర్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ గజ్జల కాంతం, వైస్ చైర్మన్ గంధం రాములు, కోలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.