యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరు ప్రశాంత్ ఎం.వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ తిరు ప్రతీక్ తయల్, ట్రెజరీ, అకౌంట్స్ విభాగం అదనపు డైరెక్టర్ నిరూపరాక్ సందర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ గ్రామపంచాయతీ పరిధిలో ఉపయోగించే ఈఏఫ్ఎమ్ఎస్( ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టం) పోర్టల్ వినియోగం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ పోర్టల్ ద్వారా తెలంగాణ గ్రామ పంచాయతీలో నిధులను ఎలా ఉపయోగించుకుంటున్నారనే అనే విషయాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ ఉపయోగించే ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ను తమిళనాడులో సైతం అందుబాటులోకి తీసుకుకొస్తామని వారు తెలిపారు.