హుస్నాబాద్, మే 8: ‘సార్.. మా పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై విచారణ జరిపించండి’ అంటూ ఓ విద్యార్థిని ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేసిన ఘటన హుస్నాబాద్ ప్రాంతంలో చర్చనీయాంశమైంది. ‘సార్.. మా పాఠశాలతోపాటు హాస్టల్లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోండి. నేను ఇదే పాఠశాలలో చదవాలనుకొంటున్నా. నాకు న్యాయం చేయండి’ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని తెలంగాణ మోడల్ స్కూల్ 9వ తరగతి విద్యార్థిని వెల్దండి హరిణి ట్విట్టర్ ద్వారా మంత్రికి ఆవేదనను తెలియజేసింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. హరిణి ట్వీట్ను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డికి ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. కాగా, మోడల్ స్కూల్ విద్యార్థిని తమ స్కూల్ గురించి మంత్రి కేటీఆర్కు ఫిర్యాదు చేయడం, ఆయన సానుకూలంగా స్పందించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.