Bandi Sanjay | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): బురదచల్లటమే పనిగా పెట్టుకున్నోడికి నిజాలతో పనిలేదు. నిరంతరం నిందలు మో పటానికే మొగ్గుచూపుతాడు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ కోవలోకే వస్తారు. రాష్ట్రంలో వరుసగా వస్తున్న నోటిఫికేషన్లను అడ్డుకోవాలని చూస్తున్న బండి సంజయ్ కు కుట్రలు తారాస్థాయికి చేరాయి. మంగళవారం గ్రూప్-1 ప్రిలిమ్స్పై విషపూరిత ప్రచా రం మొదలుపెట్టారు. పరిమిత స్థాయిలో జరిగిన ఈ లీకేజీని గ్రూప్-1 పోస్టులకు సైతం అంటగడుతూ బండి సంజయ్ మంగళవారం ట్వీట్లు చేశారు. నిందితుడు ప్రవీణ్ గ్రూప్-1 ప్రిలిమ్స్లో టాపర్గా నిలిచాడంటూ ప్రచారం చేశారు. ఒక ఓఎంఆర్ షీట్ను సైతం జత చేశా రు. అయితే ఇవన్నీ అవాస్తవాలని, తప్పుడు ప్రచారమని అధికారులు స్పష్టంచేశారు.
వాస్తవం: ప్రవీణ్కుమార్ గ్రూప్-1 ప్రిలిమ్స్లో క్వాలిఫై కూడా కాలేదు. అతను తప్పు గా బబ్లింగ్ చేయటంతో సాంకేతికంగా అనర్హుడయ్యాడు. అలాంటి సమయంలో అతడి పేపర్ వ్యాల్యుయేషన్ను టీఎస్పీఎస్సీ కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. కాబట్టి అతనికి అసలు మార్కులే కేటాయించలేదు. అం దుకే మెయిన్స్కు ఎంపిక కాలేదు. దిద్దని పేపర్లో అత్యధిక మార్కులెలా వచ్చాయో బండి సంజయ్కే తెలియాలి.
వాస్తవం: రాష్ట్రంలోని ఒకే ఒక కేంద్రంలో సాంకేతిక కారణాల వల్ల రెండుగంటలు ఆలస్యంగా పరీక్ష జరిగింది. టీఎస్పీఎస్సీ అనుమతితోనే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని పరీక్ష నిర్వహించారు. ఆ కేంద్రంలో ప్రవీణ్కుమార్ లేడని అధికారులు ధ్రువీకరించారు.
రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి బండి సంజయ్కి, బీజేపీకి వణుకు మొదలైం ది. బీజేపీ ఒక్క సీటైనా గెలువలేని పరిస్థితిలో ఉన్న సమయంలో ఉద్యోగాలు భర్తీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవనే భయం మొదలైంది. అందుకే ఉద్యోగ ప్రకటనలను అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ‘బీజేపీకి కార్యకర్తలను దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్లను ఇస్తున్నది’ అంటూ వింత వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ‘మీ చదువులను ఆరేడు నెలలపాటు పక్కన పెట్టండి. బీజేపీ కోసం పనిచేయండి’ అంటూ విషప్రచారం చేశారు. ఈ పాచిక సైతం పారకపోవటంతో ఇప్పుడు ప్రశ్నపత్రం లీకేజీ రూపంలో బండికి ఓ అస్త్రం దొరికింది. పరిమిత స్థాయిలో జరిగిన లీకేజీని అన్ని పరీక్షలకు ఆపాదిస్తూ విష ప్రచారం మొదలెట్టారు. వాస్తవానికి ఇప్పటివరకు లీకేజీ నిందితులకు, గ్రూప్-1 పరీక్షలో ఎలాంటి పాత్ర నిరూపితం కాలేదు. అయినా బీజేపీ తన విషప్రచారాన్ని కొనసాగిస్తున్నది. బండి ట్వీట్లపై అభ్యర్థులు సోషల్మీడియాలో ఫైర్ అవుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా లక్షల మంది ఉద్యోగార్థులను ఎందుకు భయపెడుతున్నారంటూ బండిపై మండిపడుతున్నారు.
పేపర్ లీకేజీ కేసులో రెండో నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ కార్యకర్త అని సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అతడి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసిన బీజేపీ అనుకూల కథనాలను, ఫొటోలను ఇందుకు ఆధారంగా చూపుతున్నారు. ఈ లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఏమైనా ఉన్నదా? అని అనుమానిస్తున్నారు. దర్యాప్తు బృందం ఈ కోణంలో విచారించి నిగ్గు తేల్చాలని కోరుతున్నారు.