నందికొండ, అక్టోబర్ 28 : దేశంలో 70 కోట్ల మంది జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. బీసీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నందికొండ పైలాన్కాలనీలోని బీసీ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాల వారికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్, బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అమలవుతున్న 25 శాతం రిజర్వేషన్తో అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతున్నదని తెలిపారు. ఏ వర్గానికి లేని క్రీమీలేయర్ వర్తింపుతో బీసీ రిజర్వేషన్ పూర్తిగా అమలు కావట్లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీ కులాల లెక్కలు చేపట్టాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బీసీ వర్గీకరణపై తమ వైఖరి వెల్లడించాలన్నారు. బీసీ రిజర్వేషన్ను జనాభా ప్రాతిపదికన చేపట్టకపోతే రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో బీసీలు సమావేశాలు నిర్వహించి తమ సత్తా చాటుతామన్నారు.