హైదరాబాద్ సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మందిలో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధికి హైదరాబాద్ గాంధీ దవాఖాన వైద్యులు చికిత్స చేసి ఓ బాలిక ప్రాణాలను రక్షించారు. సూపరింటెండెంట్ రాజారావు, పీడియాట్రిక్ విభాగాధిపతి నాగార్జున సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.
కర్ణాటకలోని నాందేడ్కు చెందిన 11 ఏండ్ల బాలిక కొంతకాలంగా నియంత్రణలోకి రాని రక్తపోటు, తలనొప్పి, మైకం,వాంతులతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఇటీవల గాంధీ దవాఖానకు తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆమె ‘బైలేటరల్ అడ్రినల్ ఫియోక్రోమోసైటోమా’అనే వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ఇది బాల్యం నుంచే ‘అడ్రినల్ మెడులా’్ల నుంచి ఉత్పన్నమయ్యే అసాధారణ కణితి అని తెలిపారు. ల్యాప్రోస్కోపిక్ ద్వారా కణితిని విజయవంతంగా తొలగించినట్టు తెలిపారు. చికిత్సకు కార్పొరేట్లో రూ.15 లక్షలవరకు ఖర్చవుతుందన్నారు.