కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 8 : ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో శుక్ర,శనివారాల్లో కరీంనగర్ వేదికగా మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోను శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించి, శనివారం రాత్రి ముగించనున్నారు.
రెండు రోజులపాటు జరిగే ఈ షోలో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు, అలాగే రుణ సౌకర్యం కల్పించే పలు బ్యాంకులు పాల్గొననుండగా, ప్రజలందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. ఇల్లు కొనాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వేదిక ఒక వరంగా మారనున్నది.