ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్లో మంగళవారం రాత్రి ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని రాంలింగపేట్ గ్రామానికి చెందిన అనసూయ అనే గర్భిణీ నొప్పులు రావడంతో ప్రసవం కోసం మంగళవారం సాయంత్రం రిమ్స్లో చేరింది. ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది.
ఒకరు 1.600 గ్రాములు, మరొకరు 1.570, ఇంకొకరు 1.440 గ్రాముల బరువు ఉన్నారు. తల్లి, ముగ్గురు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని ఎస్ఎన్సీయూ నోడల్ ఆఫీసర్ అనంతరావు తెలిపారు. ఇప్పటికే తమకు ఇద్దరు కుమారులు ఉన్నారని, ఆడపిల్ల కోసం ఎదురు చూశామని, ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు జన్మించడం ఆనందంగా ఉందని అనసూయ-రమేశ్ దంపతులు తెలిపారు.