Telangana | కాగజ్నగర్, ఏప్రిల్ 10 : బతికి ఉన్నా చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదు చేసి ఓ వ్యక్తి బీమా సొమ్ము కాజేశారు. తీరా ఈ విషయం అతడికి తెలిసి లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్ బెజ్జూర్ మండల కేంద్రానికి చెందిన కోట రాజన్న 2018లో కాగజ్నగర్ పట్టణంలోని లేబర్ కార్యాలయంలో లేబర్ గుర్తింపు కార్డు పొందాడు. ఇదే క్రమంలో లేబర్ కార్డు రెన్యూవల్ కోసమని గత నెల 6న స్థానిక మీ సేవ కేంద్రానికి వెళ్లాడు.
సహజమరణం పొంది డబ్బు కూడా తీసుకున్నట్టు ఆన్లైన్లో చూపడంతో ఆయన అవాక్కయ్యాడు. సోమవారం లేబర్ కార్డు రెన్యూవల్ చేయడంతో పాటు పూర్తి విచారణ జరిపి ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని లేబర్ ఆఫీసులో కోట రాజన్న ఫిర్యాదు చేశాడు.