దుండిగల్,జనవరి4 : అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య(Commit suicide)కు పాల్పడిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్(Dundigal) పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళకు చెందిన మాథ్యూకోషీ సైన్యంలో పనిచేసిన అనంతరం నగరంలో పోలీస్అధికారిగా కూడా విధులు నిర్వహించి పదవీవిరమణ అనంతరం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని చర్చిగాగిళ్లాపూర్లో స్థిరపడ్డారు. ఆయనకు భార్యతో పాటు కూతురు, కొడుకు జియో మాథ్యూస్(38) ఉన్నారు.
కూతురుకు వివాహం కాగా కొడుకు జియో మాథ్యూస్ అవివాహితుడు. కొడుకు ప్రవర్తన సరిగ్గాలేక పోవడంతో గత కొంతకాలంగా తండ్రి, కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జియో మాథ్యూస్ గురువారం తెల్లవారు జామున తన గదిలో తాడుతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీవైద్యశాలకు తరలించారు. కాగా జియో మాథ్యూస్ గతకొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.