చేర్యాల, మార్చి 31 : సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బస్సు దిగేందుకు యత్నించి(Bus accident) వ్యక్తి మృత్యువాత(Person died) పడ్డాడు. ఈ విషాదకర సంఘటన చేర్యాల పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణానికి చెందిన సూర్న కనకయ్య(60) అనే వ్యక్తి జగదేవ్పూర్లో బంధువు ఒకరు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యాడు. తిరిగి చేర్యాల బస్స్టాండ్లో బస్సు దిగాడు.
ఈ క్రమంలో చేర్యాల పట్టణంలోని పాత బస్టాండ్ వద్దకు చేరుకునేందుకు జనగామ వైపుకు వెళ్లే బస్సు ఎక్కాడు. కాగా, తాను దిగాల్సిన స్టాఫ్ దాటిపోతుందని భావించిన కనకయ్య.. ఒక్కసారిగా బస్సు నుంచి కిందకు దిగేందుకు యత్నించి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన కనకయ్యను బంధువులు సిద్దిపేట దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్య సేవలకు కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్కు తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో కనకయ్య మృతి చెందాడు.