నిర్మల్ : నిర్మల్ పట్టణంలోని శాంతినగర్లో దారుణం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. వెంకటేశ్, భార్గవ్ అన్నదమ్ములు కాగా, వీరికి తిరుపతి అనే వ్యక్తితో గత కొంతకాలం నుంచి వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలో తిరుపతి నిన్న రాత్రి అన్నదమ్ములపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. భార్గవ్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పాతకక్షల వల్లే తిరుపతి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.