నల్లగొండ : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు మున్సిపాలిటీలోని 2, 3 వార్డుల ఇంచార్జీగా ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మంగళవారం 3వ వార్డులో ఇంటింటి ప్రచారం చేస్తూ.. ఓ ఇంటికి వెళ్లగా, ఒక వృద్ధుడు మంత్రిని సైతం అబ్బురపరిచేలా మాట్లాడుతూ.. భావోద్వేగానికి లోనయ్యాడు.
ఆయన లేకపోతే బువ్వ ఎక్కడిది? ఆయన వచ్చినంకనే బువ్వ! ఆయన లేక పోతే బువ్వ లేదు, బట్ట లేదు!! 60, 70 ఏండ్ల కానుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు. ఆయన పోయిన తెల్లారి బువ్వ దొరకదు. ఆయన రావాలి. అందరికీ చెప్పుకుంట వత్తాన! ఆయన ఉంటేనే అన్ని…అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆ వృద్ధుడు చెప్పాడు.
మునుగోడు నియోజకవర్గంలో సారే కావాలి.. కారే రావాలి.. అంటూ.. కేసీఆర్ సార్ లేకపోతే ఈ బువ్వ లేదు.. బట్ట లేదు.. ఆయన వచ్చినంకనే అన్ని మంచిగా జరుగుతున్నయ్ అని ఓ వృద్ధుడి ఉద్వేగపూరిత మాటలు.. pic.twitter.com/Qu0Y9g7vDp
— Namasthe Telangana (@ntdailyonline) October 11, 2022