హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): నల్లగొండ పట్టణానికి చెందిన, శాలిగౌరారం జడ్పీహెచ్ఎస్లో పీఈటీగా విధులు నిర్వహిస్తున్న తగుళ్ల వెంకన్నకు ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్యలో పీహెచ్డీ పట్టాను అందజేసింది.
పాలమూరు యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎల్బీ లక్ష్మీకాంత్ రాథోడ్ పర్యవేక్షణలో ‘ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మోటార్ క్వాలిటీస్ అండ్ ఫిజియోలాజికల్ వేరబుల్స్ అమౌంగ్ మిడిల్ డిస్టెన్స్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ’ అనే అంశంపై పరిశోధన చేసినందుకు ఓయూ డాక్టరేట్ పట్టాను అందజేసింది.