పెద్దపల్లి : గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదం నెలకొంది. ఆస్పత్రి వాష్రూమ్లో బాలింత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనను గమనించిన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని రామగిరి మండలం రొంపికుంట గ్రామానికి చెందిన గుమ్మడి పద్మ(29)గా పోలీసులు గుర్తించారు.
పద్మ 15 రోజుల క్రితమే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న పద్మ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.