హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): నిండు సభలో కాంగ్రెస్ పార్టీ ఓ మార్ఫింగ్ వీడియోను ప్రదర్శించడం అత్యంత దారుణమైన విషయమ ని, దీనిపై వెంటనే సైబర్ క్రైం పోలీసులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోష ల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తప్పులు అబద్ధాలు వల్లవేసి, అబద్ధపు వీడియో లు ప్రసారం చేసి సభ గౌరవాన్ని, మర్యాదను కాంగ్రెస్ ప్రభుత్వం మంటగలిపిందని సోమవారం ఒక ప్రకటన లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్ఫింగ్ వీడియోను అధికారికంగా అసెంబ్లీలో చూపించి.. సభను, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన మంత్రి పై వెంటనే చర్యలు తీసుకోవాలని డి మాండ్ చేశారు. సైబర్ క్రైం అధికారులు దీనిని సుమోటోగా కేసు బుక్ చేయాలని కోరారు. వాస్తవాలు చెప్పేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రి హరీశ్రావును మాట్లాడకుండా సీఎం, మంత్రు లు అడ్డుకున్న తీరు దారుణమని పేర్కొన్నారు. మార్ఫింగ్ వీడియోపై స్పీకర్ స్పందించి.. నిజానిజాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.