హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను గుర్తుండిపోయేలా నిర్వహించాలని సీఎస్ సోమేశ్కుమార్ సూచించారు. ఈ వేడకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులను ఆహ్వానించినట్టు తెలిపారు. వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియాన్ని డీజీపీ మహేందర్రెడ్డితోపాటు సీనియర్ అధికారులతో కలి సి సీఎస్ శనివారం పరిశీలించారు. తొలుత వేడుకల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
సీఎం కేసీఆర్ ము ఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, డీసీసీబీ చైర్మన్లు, పీఏసీఎస్ చైర్మన్లు, వివిధ ఆలయాల ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి ఎల్బీ స్టేడియానికి ప్రత్యేక బస్సు లు ఏర్పాటు చేశామన్నారు.
వజ్రోత్సవ కార్యక్రమాలను ఇప్పటివరకు ఘనంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషిస్తున్న కలెక్టర్లు, అధికారులను అభినందించారు. 22న మధ్యా హ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే ముగింపు వేడుకల్లో శంకర్ మహదేవన్, శివమణి సంగీత విభావరి, దీపికారెడ్డి బృందంతో శాస్త్రీయ నృత్యాలు తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామని వివరించారు.
తెలంగాణ జానపద కార్యక్రమాలు, లేజర్ షో ఉంటాయని చెప్పారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమాలన్నీ దేశ స్వాతంత్య్ర పోరాటం, దేశభక్తి ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, అడిషనల్ డీజీ జితేందర్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వారం రోజులుగా ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న వజ్రోత్సవ పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగియనున్నది. విభిన్న అంశాలపై వేల పుస్తకాలను 50 స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల వరకు పుస్తక ప్రదర్శన ఉంటుందని, పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోరారు.